బీఆర్ఎస్ తోనే దివ్యాంగులకు భరోసా

– కల్వకుర్తి తాలూకా బీఆర్ఎస్ కన్వీనర్ మల్లికార్జున్ 

– బీఆర్ఎస్ దివ్యాంగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్ : బీఆర్ఎస్ తోనే దివ్యాంగుల కుటుంబాలకు భరోసా కల్గిందని కల్వకుర్తి తాలూకా బీఆర్ఎస్ దివ్యాంగుల ఐక్య వేదిక కన్వీనర్ మల్లికార్జున్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ పట్టణంలో జైపాల్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున్ హాజరై మాట్లాడారు. దివ్యాంగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. జైపాల్ యాదవ్ ను మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా పంపాలని ఆయన దివ్యాంగులకు సూచించారు. ఈసందర్భంగా ఆమనగల్ కడ్తాల్ తలకొండపల్లి మాడ్గుల మండలాల్లో విస్తృతంగా పర్యటించి బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ దివ్యాంగుల ఐక్య వేదిక నియోజకవర్గస్థాయి సీనియర్ నాయకులు, ఆయా మండలాల కన్వీనర్లు చెన్నకేశవులు, టి.మల్లేష్, శ్రీశైలం, వాలి నాయక్, సురేష్, రమేష్ నాయక్, శ్రీను, అల్వాల్, మద్దూరి రమేష్, శ్రీను నాయక్, గీత తదితరులు పాల్గొన్నారు.
Spread the love