నవతెలంగాణ – తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ (ఫిబ్రవరి-19) విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉదయం10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తుల సేవా టికెట్లు డిప్నకు ఈ నెల 21 ఉదయం10 గంటల వరకు నమోదుకు అవకాశం ఉంది. లక్కీడిప్ టికెట్లు పొందినవారు అదే రోజు మధ్యాహ్నం12లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలి. ఈ నెల 22న కల్యాణోత్సవం, 23న అంగప్రదక్షిణం.. 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను టీటీడీ విడుదల చేయనుంది.