- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో 2007 నుండి ఆరోగ్య మిత్రాలుగా పేద ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వారికి మాత్రమే టీం లీడర్స్ గా అవకాశం కల్పించాలని అదేవిధంగా తక్కువ వేతనంతో పని చేస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు తక్షణమే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కల్పించాలని కోరుతూ మండలంలోని ఇందూర్తి గ్రామానికి చెందిన ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య శనివారం హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ నరేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
- Advertisement -



