నవతెలంగాణ కథనానికి స్పందన..

– గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించిన ఎస్ఐ
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని కిరాణా షాపులు పాన్ షాపుల్లో ఆదివారం రోజున దాడులు నిర్వహించారు. మత్తులో యువత చిత్తు అను శీర్షికన శనివారం రోజు ప్రచురితమైన కథనానికి పెద్దకొడప్ గల్ ఎస్సై కోన రెడ్డి స్పందించి వెంటనే మండల కేంద్రంలోని పలు కిరాణా షాపులలో మరియు పాన్ షాప్ లలో గుట్కాలపై,మత్తు పదార్థాలపై ఆదివారం రోజు రైడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి గుట్కాలు గానీ మత్తు పదార్థాలు గానీ విక్రయించినట్టయితే వారిపై చట్ట పర్యంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన దుకాణం దారులను హెచ్చరించారు.
Spread the love