బియ్యం పిరమాయే.?

– పెరిగిన ధరలు….సామాన్యులు విలవిల
నవతెలంగాణ-  మల్హర్ రావు
మునుపెన్నడూ లేని ధరలతో సామాన్యులు బియ్యం కొనలేక పస్తులుండే పరిస్థితులు తలెత్తాయి.గత సీజన్ లో రైతులు ధాన్యం రెట్టింపు స్థాయిలో పండించినప్పటికి బియ్యం ధరలు అమాంతం పెరగడంతో మార్కెట్ లో సన్నబియ్యం కొనలేకపోతున్నారు.ఇక్కడి పండించిన ధాన్యాన్ని దళారులు అధిక ధరలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్టాలకు తరలించడంతోనే బియ్యం ధరలు ఆకాశనంటూతున్నాయి.మండలంలో నిత్యం పెరుగుతున్న బియ్యం ధరలతో పూట తిండికి దూరం అవుతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఈ సీజన్ లో రైతుల నుంచి ఇప్పటికి 50 టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఇంక పొలాలు కొతకు ఉన్నాయి. అయిన బియ్యం ధరలు పెరగడంపై అంతు పట్టడం లేదు.మండల వ్యాప్తంగా సన్నరకం ధాన్యం పండించడం కొంత తక్కువగా ఉన్నప్పటికీ గతంలో పోలిస్తే ధరలు మాత్రం పెరిగాయి.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి…
మండలంలో ఈ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సెకరిస్తోంది. చిన్నతరహా ప్రాజెక్టులైన కాపురం చెరువు,బొగ్గులవాగు ప్రాజెక్టు, చెరువులు, కుంటలు, మానేరు పరివాహక ప్రాంతాల్లో పైప్ లైన్లు, బోర్ బావులు తదితరతో విస్తారంగా వరి సాగు చేశారు.రైతుల నుంచి 50 టన్నుల ధాన్యం సేకరించినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.ధాన్యం పండిన బియ్యం ధరలు అమాంతం పెరగడంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి మిల్లింగ్ అనంతరం తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్టాలకు తరలిస్తున్నారు. దీన్ని అరికట్టడంలో పోరసరఫరాల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.ఫలితంగానే ఈ ఏడాదిలో బియ్యం ధరలు పెరిగాయని,ఇతర రాష్ట్రాలకు ఎగుమతిని నిరోదిస్తే ఈ పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు
ధరలు ఇలా..
క్వింటాలు …గతేడాది…..ప్రస్తుతం..
బిపిటి కొత్తవి…రూ.4వెలు….4,600
బిపిటి పాతవి…4.600…….5.200
జైశ్రీరామ్ కొత్తవి…4.400…..4800
జైశ్రీరామ్..పాతవి..5.600…6.800
హెచ్ఏంటి……4.600…..5.600
బాస్మతి…….9.000…..12.000
సోనా మసూరి….5.600….6.200.
Spread the love