చిన్నతూండ్లకు ఆర్టీసీ బస్సు నడపాలి

– మంథని డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ 
నవ తెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల నుంచి పెద్దతూండ్ల మీదుగా మంథనికి  ఆర్టీసీ బస్సు నడపాలని మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ కు శనివారం సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య, పులిగంటి రాములు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు గతంలో మల్లారం నుంచి చిన్నతూండ్ల,పెద్దతూండ్ల, తాడిచెర్ల మీదుగా మంథనికి బస్సులు నడిసేవన్నారు.చిన్నతూండ్ల నుంచి పెద్దతూండ్లకు వేళ్ళు రహదారికి ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో బస్సును నిలిపివేశారని తెలిపారు. ఈ క్రమంలో జేసిబి పెట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికించామని బస్సును నడపాలని విజ్ఞప్తి చేశారు.బస్సు నడవకపోవడంతో గ్రామస్తులకు,విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా బస్సును నడిపించాలని కోరారు.
Spread the love