నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నవతెలంగాణ బుక్ హౌస్ ని భువనగిరి రూరల్ ఎస్సై అనిల్ కుమార్, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ లు వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవతెలంగాణ బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తకం ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఇలాంటి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. ఆయనతోపాటుగా యువజన కాంగ్రెస్ బృందం సభ్యులు సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేశారు. వారితో పాటుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు మలుపు బాల్ రెడ్డి, ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కొత్త రాజశేఖర్ రెడ్డి, గంగాదేవి బాలరాజ్, సాల్వేరు ఉపేందర్, దయ్యాల శ్రీశైలం, సరగడ కరణ్, మూలయం సింగ్ యూత్ బ్రీ గ్రేడ్ అధ్యక్షులు మేకల బాలు యాదవ్, సామాజిక నాయకులు రాసాల దయాకర్, నవతెలంగాణ బుక్ హౌస్ జనరల్ మేనేజర్ వాసు, నవతెలంగాణ జిల్లా రిపోర్టర్ పాక జహంగీర్, ఉస్మాన్ షరీఫ్, ఉమ్మడి నల్గొండ జిల్లా బుక్ హౌస్ ఇంచార్జ్ రఘువరన్ లు పాల్గొన్నారు.
నవతెలంగాణ బుక్ హౌస్ సందర్శించిన రూరల్ ఎస్సై అనిల్ కుమార్
- Advertisement -
- Advertisement -



