హజ్ యాత్రకు బయలుదేరిన సానియా మిర్జా..

నవతెలంగాణ – హైదరాబాద్: భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర హజ్ యాత్రకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. హజ్ యాత్రకు వెళ్లే దివ్యమైన అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు అందించాడని సానియా వెల్లడించారు. తన జీవిత పరివర్తన అనుభూతికి సిద్ధమవుతున్నానని, ఆధ్యాత్మిక భావనలతో తన హృదయం నిండిపోయిందని తెలిపారు. అందుకు కృతజ్ఞురాలినని అన్నారు.

Spread the love