గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వారోత్సవాలు

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం బుధవారం, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ యాదగిరిగుట్ట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, పంచాయితీ కార్యదర్శి ఈక్కిరి ఉపేష్, ప్రాదేశిక సభ్యులు కర్రే విజయ వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ ప్రజలతో చేయి చేయి కలుపుదాం గ్రామ అభివృద్ధికి తోడ్పడుదాం అనే నినాదంతో గ్రామపంచాయతీ నుండి ర్యాలీగా బయలుదేరి ప్రజలకు చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహించారు. వీరి పర్యవేక్షణలో  సిబ్బంది రోడ్లు డ్రైనేజీలు పలు పరిశుద్య పనులు నిర్వహించారు. గ్రామంలో ప్రజల దగ్గరికి వచ్చి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మూల్యాంక, చంద్రకళ, తేజశ్రీ కరోబార్, కర్రె చంద్రశేకర్,  గ్రామ పెద్దలు మారబోయిన బాలరాజు, కర్రె పేదోళ్ల గణేష్, నిమ్మల కనకరాజు, భూషోల రాము, అంగన్వాడి టీచర్స్ మంజుల, అరుణ, వైద్య సిబ్బంది సిద్ధమ్మ, రేణుక, అండాలు, గ్రామపంచాయతీ సిబ్బంది శంకర్, ఐలయ్య, రాజు, ఎల్లయ్య రామచంద్రయ్య, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Spread the love