మండలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

నవతెలంగాణ –  పెద్దవంగర
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల ముగ్గులు వేసి, విద్యార్థులు ఆకట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పండుగ వాతావరణంలో పుల్ జోష్ తో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా పండగలు జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో జరుపుకునే పండుగలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతాయని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, టకీ పాషా, అంజయ్య, యాకయ్య, షౌకత్ అలీ, విజయ్ కుమార్, వెంకన్న, శ్రీధర్, శ్రీనివాస్, సువర్ణ, హైమ, కరుణ తదితరులు పాల్గొన్నా
Spread the love