చివ్వేంల నూతన ఎంపీడీవో గా సంతోష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మి బదిలీ కాగా వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న సంతోష్ కుమార్ చివ్వేంలకి బదిలీపై వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని, అన్ని వర్గాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.