సర్వపిండి బాగుంది: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో బియ్యం పిండితో చేసే సర్వపిండి బాగా పాపులర్ అన్నా విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులకు మహిళలు వారు తయారుచేసిన వంటకాలను వడ్డించారు. ఇందులో సర్వపిండిని ఇష్టంగా తిన్న సీఎం రేవంత్ బాగుందంటూ మరికొంచెం అడిగి తీసుకున్నారు.
Spread the love