పతి కోసం సతి ప్రచారం 

– కసిరెడ్డి మాధవి నారాయణరెడ్డి ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్: ఆమనగల్ పట్టణంలోని శ్రీకాంత్ కాలనీ, పోస్టాఫీసు, విద్యానగర్ కాలనీల్లో మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి సతీమణి కసిరెడ్డి మాధవి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తన భర్త కసిరెడ్డి నారాయణరెడ్డిని మద్దతుగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను వేడుకున్నారు. ఈసందర్భంగా ఖారా దేవుతూ, బట్టలు కుడ్తూ, ఇస్త్రీ చేస్తూ, చాయ్, పండ్లు అమ్ముతూ మాధవి రెడ్డి నిర్వహించిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వస్పుల జంగయ్య, మండల అధ్యక్షులు తెల్గమల్ల జగన్, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, సీనియర్ నాయకులు కృష్ణ నాయక్, అలీం, ఖాదర్, కాలే మల్లయ్య, రహీం, వెంకటేష్, ఎంగలి ప్రసాద్, అయ్యూబ్, కరీం, నాసర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love