రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నవతెలంగాణ-పెద్దవంగర
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలోని బొమ్మకల్లు శివారులో కండ్య తండా వద్ద మంగళవారం రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు పాల నరేష్, ఎస్కే అక్బర్ పై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love