ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు  జహంగీర్ ను పార్లమెంటుకు పంపించండి..

నవతెలంగాణ – మునుగోడు
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ను ప్రజలు ఆదరించి భువనగిరి సీపీఐ(ఎం) పార్లమెంటు అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) మండల సహాయ కార్యదర్శి వరుకుప్పలమత్యాలు కోరారు. సోమవారం  మండలంలోని కల్వకుంట్ల  గ్రామంలో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి  పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను పార్లమెంటుకు  పంపేందుకు గ్రామాలలో రైతులు కార్మికులు కర్షకులు ఒక్కటై ఆశీర్వదించాలని కోరారు. భువనగిరి గడ్డపైన సీపీఐ(ఎం) గెలిస్తే ప్రజల పక్షాన పార్లమెంటులో ప్రజా గొంతుకై కమ్యూనిస్టులు వినిపిస్తారని తెలిపారు. పది సంవత్సరాలుగా దేశాన్ని  పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రైవేట్ పరం చేస్తూ దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగమును పెంచి పోషించిందని అన్నారు. వీర తెలంగాణ  రైతాంగ సాయుధ పోరాటంలో  కమ్యూనిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన చరిత్ర ఎర్రజెండదని అన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ఒకపక్క ధన బలంతో వస్తున్న అభ్యర్థులకు , మరోపక్క ప్రజల బలంతో వస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థికి జరుగుతున్న యుద్ధంలో ఎగిరేది ఎర్రజెండా అనే అని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే  పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజల న్యాయం కోసం పోరాడే ఎర్రజెండా పక్షాన  నిలిచి ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్మికులు కర్షకులు కొట్లాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ పెట్టుబడుదారులకు కొమ్ముగాసే విధంగా బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను ఎత్తివేసేందుకు కుట్ర పండడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగం రక్షించాలన్న, ప్రజాస్వామ్యంను పరిరక్షించాలన్న కేంద్రంలో బీజేపీని సాగనంపాలని అన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు బిజెపి కుట్ర చేస్తున్నారని అన్నారు. రాముడు పేరుతో బీజేపీ  రాజకీయాలు చేస్తూ కులమతాల మధ్య చిచ్చులు పెట్టి , మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందుత్వ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి, సీపీఐ(ఎం) నాయకులు బొందు చిన్న నరసింహ,పగిళ్ల మధు , బొందు సుందరయ్య, పగిళ్ల  యాదయ్య, బొందు నవీన్, చేకూరి బిక్షం, బి నరసింహ తదితరులు ఉన్నారు.
Spread the love