ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలి: సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా

నవతెలంగాణ – ఆర్మూర్ 

చిన్ననాటి నుంచే విద్యార్థినిలు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా, పట్టణ ఏ సి పి బస్వా రెడ్డి లు అన్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల యందు బుధవారం ఫేర్వెల్ పార్టీ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ సబ్జెక్టులపై అవగాహన పెంచుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డి, ఉపాధ్యాయ బృందం ముజుబుద్దిన్, కవిత,రమ్య, పద్మ ,కృష్ణవేణి ,పిడి గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ధనవేని వైస్ ప్రిన్సిపాల్ శరణ్య ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Spread the love