ప్రతి రైతుకు సేవలు అందించాలి 

నవ తెలంగాణ- వీర్నపల్లి : ప్రతి ఒక్క రైతుకు సేవలు అందించాలని నాఫ్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామరావు అన్నారు. వీర్నపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుజ్జులా రాజిరెడ్డి, వైస్ చైర్మన్ గా భూక్య తులసిరాం మార్కేట్ కమిటి సభ్యులు బుధ వారం బాధ్యతలూ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎ ఎం సి చైర్మన్ రాజిరెడ్డి కుమార్ ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అన్నదాతలకు అందుబాటులో ఉండి తన సేవలను అందిస్తానని రైతులకు వరి ధాన్యం సేకరణలో ముందుండి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాటి దినకర్, ఎంపిపి మాలోతు భూలా, జెడ్పీటిసి గుగులోతు కళావతి, ఎంపిటిసి అరుణ్ కుమార్, జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, సెస్ డైరెక్టర్ మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగరావు, ఎల్లారెడ్డి పేట జడ్పిటిసి లక్ష్మన్ రావు, పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ రెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సుభాష్, సెస్ డైరెక్టర్ కృష్ణ హారి, ప్రజా ప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love