మహాబుబ్ నగర్ లో విద్యార్ధి నాయకులపై బీజేపీ దాడిని ఖండించండి: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ హైదరాబాద్: దేశంలో పరీక్ష విధానంలో అవీనీతీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, రోజుకో లీకులు చేస్తోంది. నీట్ లీకేజీపై, నెట్ పేపర్ లీకేజీపై విద్యార్థులకు న్యాయం చేయాలని, బీజేపీ ఎంపీలు నోరుమోదపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఎంపీల క్యాంప్ కార్యాలయాల ముందు ఆందోళనకు పిలుపునిచ్చాము. ఈ పిలుపులో భాగంగా మహాబుబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ క్యాంప్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయడానికి సిద్దమైన ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ నాయకులపై బీజేపీ నాయకులు కర్రలతో దాడికి యత్నించారు. విద్యార్ధి నాయకులపై బీజేపీ నాయకులు పిడిగుద్దులు కురిపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భౌతిక దాడులు కాదు, అన్యాయం గా నీట్ పేపర్ లీకు, నెట్ రద్దు వల్లన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి అవసరమైతే ప్రధానిని నిలదీయాల్సిన అవసరం ఉంది కానీ పోరాడే వారిపై భౌతిక దాడులు కాదని ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుంది. భౌతిక దాడులకు పాల్పడితే తగిన గుణపాఠం తప్పదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు హెచ్చరించారు.

Spread the love