మండలంలో షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో గురువారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 400 మంది పదవ తరగతి విద్యార్థులకు, ఆయా పాఠశాలలో పరీక్ష ప్యాడ్ లను అందజేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు, మద్దికుంట శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అనాధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. విద్యార్థులు కష్టపడి 10/10 మార్కులతో తల్లిదండ్రులతోపాటు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని, కష్టపడి చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని సూచించారు. కార్యక్రమంలో గిద్ద ఎం పి టి సి ప్రవీణ్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు బండి ప్రవీణ్, పెండ్యాల నర్సారెడ్డి, దుంపల బాలరాజు, కుమ్మరి శంకర్, బి పేట నర్సింలు, ఇర్షాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Spread the love