పొన్నం ప్రభాకర్ పై మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం సిగ్గుచేటు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాజకీయ అనుభవం లేదని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు , సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య విమర్శించారు, శనివారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంకా అధికారంలోనే ఉన్నామనే బ్రమలో ఉన్నారన్నారు. గ్రామాలలో సర్పంచులు పూర్తిచేసిన గ్రామపంచాయతీల ప్రారంభోత్సవానికి మంత్రి రావడంలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం సర్పంచుల బిల్లులు చెల్లింపులో నిర్లక్ష్యం చేయలేద అని ప్రశ్నించారు. మీ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తను సొంతగా కార్యకర్త నుండి ఎదిగిన నాయకుడని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ల తండ్రి పేరు పెదనాన్న పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చినట్లు కాదన్నారు.  ప్రజలు దొర పరిపాలన వద్దని, కాళ్లు మొక్కించుకునే పరిపాలన మాకు వద్దని మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Spread the love