హైదరాబాద్: పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ మోబిల్వేర్ టెక్నాలజీస్లో 38 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నట్టు జాగల్ ప్రీపెయిడ్ సొల్యూషన్స్ వెల్లడించింది. ఈ వాటాను రూ.22.85 కోట్లతో కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. పోస్ట్ ఇష్యూ ద్వారా 26 శాతం వాటాను రూ.15.60 కోట్లతో, మరో 12.34 శాతం వాటాను ప్రమోటర్ల నుంచి రూ.7.25 కోట్లతో స్వాధీనం చేసుకున్నట్టు జాగల్ ఎండీ, సీఈఓ అవినాష్ గొడ్ఖింది తెలిపారు.