అక్రమ ఇసుక టిప్పర్ ను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ. ఉదయ్ కుమార్..

 

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం నీల గ్రామ శివారులో కొప్పర్ గా నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. మండలం గుండా అక్రమ ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక రివ్యూ నిర్వహించాగా బోధన్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక మొరం దందాను అరికట్టాలని ఆదేశించారు. పోలీస్ ఉన్నదధికారుల ఆదేశాల మేరకు మండలంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
Spread the love