ఘనంగా సీతారాముల కళ్యాణం.. హాజరైన నిర్మాత దిల్ రాజు

నవతెలంగాణ – మోపాల్
బుధవారం రోజున  నర్సింగ్ పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలో అత్యంత వైభవంగ  శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగ నిర్వహించిన అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య, వేద పండితులు సత్యం స్వామి. ఆలయ ధర్మకర్త నర్సింహ రెడ్డి దంపతులు, దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి దంపతులు కన్యాదాన ఫలసిద్ది చేసి ప్రజలందరికి ఆ కన్యాదాన భాగ్యాన్ని అందజేశారు. “ర” అంటే కష్టం “మ అంటే హరణం ఈ కలియుగంలో కష్టాలు తొలిగి సుఖాలు పొందడానికి “రామ” మంత్రమే తారక మంత్రం అని రోహిత్ స్వామి తెలియజేసారు. ఆలయ ఆస్థాన గాయకులు సమన్విత, భువనకృతి లు తమ గానామృతంతో స్వామివారి కీర్తనలను అద్భుతంగ పాడి రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి దంపతులు, దిల్ రాజు దంపతులు, ఎంపీటీసీ రాములు, రవీందర్ యాదవ్, నరాల సుధాకర్, ప్రసాద్, రమేష్, నరేందర్, రాజేశ్వర్, మురళి, వేద పండితులు రోహిత్ కుమారాచార్యులు మరియు సత్యం స్వామి, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love