వరంగల్‌ పశ్చిమలో గులాబీ జెండా ఎగురవేస్తా : దాస్యం

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో గులాబీ జెం డాను మరోసారి ఎగురవేస్తామని ప్రభుత్వ చీఫ్‌విప్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినరుభాస్కర్‌ ధీమా వ్యక్తం చే శారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలోని 9, 10 డివిజన్లలోని పలు కాలనీల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తో కలిసి వినర్ణుభాస్కర్‌ కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడపగడప కు కేసీఆర్‌ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, లబ్ధిదా రులే లక్ష మెజారిటీతో గెలిపిస్తారనే ధీమాను వ్యక్తం చే శారు. సబ్బండ వర్గాలసంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత సీఎం కేసీఆర్‌ కు దక్కు తుందన్నారు. ప్రతిఇంటికి సంక్షేమం అదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు రూ.5వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను చేయడం జరిగిందని తెలిపారు. ఈ చారిత్రాత్మక ఓరుగల్లు నగ రంలో సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా నిరంతరం ప్రజ ల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజ ల కోసం పాటుపడుతున్నానన్నారు. ఆ ప్రజలే మరొ కసారి భారీ మెజారిటీ దిశగా గెలిపించేందుకు వారి దీ వెనలు ఇస్తున్నారని ఈ ప్రజా ఆశీర్వాద దీవెన కార్యక్ర మంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్‌ సుం దర్‌రాజుయాదవ్‌, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అజీ జ్‌ఖాన్‌, జనార్దన్‌గౌడ్‌, మైనారిటీ కమిషన్‌ మెంబర్‌ దర్శన్‌ సింగ్‌, కార్పొరేటర్‌ చీకటి శారద ఆనంద్‌, డివిజ న్‌ ఇంచార్జ్‌ నజీర్‌, సీనియర్‌ నాయకులు పులి రజనీ కాంత్‌, ఖలీల్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు నాయ కులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love