సురేష్ శెట్కార్ గెలిచినందుకు ప్రత్యేక పూజలు..

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి సురేష్ శెట్కార్ గెలిచినందుకు కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  బుధవారం హనుమాన్ మందిరంలో ప్రత్యేక  పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని దస్తగీర్ దర్గా వద్దకు వెళ్లి టెంకాయలు కొట్టి  మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ..    కాటెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 313మెజార్టీ వచ్చిందని తెలిపారు.మండలంలో  కాటేపల్లి నుండి అధిక మెజార్టీ ఇచ్చి ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు.ఈ మెజార్టీ రావడానికి కష్టపడిన నాయకులకు,కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఎంపి సురేష్ శెట్కార్, ఎమ్మెల్ల్యే తోట లక్ష్మీ కాంతారావ్ ల సహాకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్, మొగులాగౌడ్,రాములుదేశాయ్,హన్మాండ్లు,రాంచందర్,హాజీ,రసూల్ పటేల్,శంకర్, షఫీ పటేల్,క్రాంతి,అశోక్,రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love