అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ -ఆర్మూర్ 

పట్టణంలోని సిద్దుల గుట్ట వద్ద గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం మాలదారులు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించినారు. గురు స్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు, ఊరేగింపు సైతం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, అయ్యప్ప ఆలయ నిర్మాణ కర్త అయ్యప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love