శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు జాజాల సురేందర్ కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, సర్పంచ్ సంజీవ్, ఉప సర్పంచ్ ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ గుప్తా తదితరులు ఉన్నారు.
Spread the love