క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎస్సై రాజు

నవతెలంగాణ – పెద్దవంగర
క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎస్సై పిల్లల రాజు అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో యువతకు మంచి భవిష్యత్‌ ఉంటుందని, స్పోర్ట్స్‌ కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను ఒకే విధంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి గుర్తింపును సాధించాలన్నారు. కాగా కడగుట్ట తండా ప్రథమ స్థానం, చిట్యాల ద్వితీయ స్థానంలో నిలిచినట్లు క్రీడా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, పెద్దవంగర గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love