శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నవతెలంగాణ -వలిగొండ రూరల్:  మండలంలోని వెంకటాపురంలో గల  శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి సల్వాద్రి మోహన్ బాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 22వ తేది బుధవారం నుండి ప్రారంభమై 27 వ తేది సోమవారం అంగరంగ వైభంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి  చేశామని, స్వామి వారి కల్యాణ మహోత్సవం 25 వ తేది శనివారం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కరుణ కటాక్షాలకు పాత్రులు కావాలని భక్తులను ఆయన కోరారు.
Spread the love