బీజేపీకి శ్రీనివాస్ నాయక్ రాజీనామా

– రాజీనామా దిశగా మరి కొందరు మండల నాయకులు..? 
నవతెలంగాణ – మల్హర్ రావు
బీజేపీ మండల ప్రదాన కార్యదర్శిగా కొనసాగుతున్న మండలంలోని అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన లావుడ్యా శ్రీనివాస్ నాయక్ బీజేపీ మండల ప్రదాన కార్యదర్శి పదవితో పాటు , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం తన రాజీనామా పత్రాన్ని మండల అధ్యక్షునికి  అందజేసినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల నుండి బీజేపీ నియోజకవర్గ స్థాయి నాయకుల తీరు నచ్చక పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా మరికొందరు మండల ముఖ్య నాయకులు కూడా మంథిని నియోజకవర్గ స్థాయి నాయకుల తీరుతో అసంతృప్తితో రగులుతూ  పార్టీని వీడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Spread the love