నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు 

నవతెలంగాణ – బొమ్మలరామారం

మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నడుస్తున్న స్టోన్ క్రషర్ల మీద నిర్లక్ష్యం వహించిన అధికారుల తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ మైలారం జంగయ్య మాట్లాడుతూ.. జనజీవనాన్ని అతలాకుతలం చేసిన స్టోన్ క్రషర్ల భారీ బ్లాస్టింగ్ మీద సంవత్సరం పాటు ప్రజలతో కలిసి ఉద్యమించినా సంబంధిత మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఒకరిపై మరొకరు నెపం మోపి తప్పించుకొని ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని తక్షణమే యజమాన్యంపై  కఠిన చర్యలు తీసుకోవాలని  బాధితులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు వట్టిపల్లి సుదర్శన్,ఊట్ల రమేష్,మైలారం నర్సింహ్మ, సుదర్శన్,ఆశయ్య, రాంబాబు,సల్ల బిక్షపతి,సుంచు యాదగిరి,సల్ల రవి, ప్రవీణ్, సత్యనారాయణ, స్వామి,మైసయ్య, పండుగ ప్రభాకర్, బిట్టు శ్రీనివాస్, రాజు, పాల్గొన్నారు.

Spread the love