శ్రీరామనవమి శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
శ్రీరామ నవమి శోభాయాత్రను ప్రశాంత వాతావరణం నిర్వహిం చుకునేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ అన్నారు. బేగంబజార్ ఛత్రి నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామ శాల వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆనంతరం హనుమాన్ వ్యాయా మశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది శోభాయాత్ర  సుమారు 700 మంది తో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో  పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్  తో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సుల్తాన్ బజార్ ఇన్ స్పెక్టర్  శ్రీనివాసాచారి, ఆఫ్టల్ గంజ్ ఇన్ స్పెక్టర్ లింగేశ్వర్రావు, నారాయణగూడ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్. ఎస్ ఐ లు కిరణ్ కుమార్ రెడ్డి, నరేశ్, శ్వేత, మధుసూదన్  పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love