ఆపదలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటా…

– గాయపడిన పాలకూరి వెంకన్నను పరామర్శించిన ముచ్చపోతుల శీను..
నవతెలంగాణ – మునుగోడు
ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఆదుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబమైన ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు , రియల్ ఎస్టేట్ వ్యాపారవేత ముత్యపుతుల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మాజీ వార్డు సభ్యులు , కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాలకూరి వెంకన్న గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఉంది గాయపడిన వెంకన్నను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు . ఈ సందర్భంగా ముచ్చపోతుల  శ్రీను మాట్లాడుతూ  ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి తను అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఎడవెల్లి సురేష్ కుమార్ , అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరమళ్ళ ప్రతాప్ , ప్రధాన కార్యదర్శి పెరమళ్ళ ప్రణయ్ కుమార్ , గౌడ సంఘం మండల అధ్యక్షుడు బొడ్డు యాదయ్య , మాజీ వార్డు సభ్యులు సిలువేరు సుదర్శన్ , రావిరాల కుమారస్వామి , నీరుడు సైదులు , నరసింహ తదితరులున్నారు.
Spread the love