నవతెలంగాణ – హైదరాబాద్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తత్త్వార్థ సంబరం ను ఇటీవల బెంగళూరులోని ADA రంగమందిర వద్ద తత్వార్థ డ్యాన్స్ స్టూడియో జరుపుకుంది. సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో నిర్వహించిన ఈ వేడుకలలో కళాభిమానులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. ఈ వేడుకలలో 10 ఏళ్ల వయస్సు చిన్నారి కృతి ఆన్య కుల్దీప్ తో పాటుగా 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారి శ్రీ రష్నా అంజలి కులదీప్ ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. వీరు ఇరువురూ బెంగళూరు నగరానికి చెందిన ప్రఖ్యాత వ్యాపారవేత్త, ద బెంగుళూరు కంపెనీ – వ్యవస్థాపకుడు డ సీఈఓ శ్రీ బంగారు కులదీప్ అంబూర్ సురేష్ బాబు నాయుడు కుమార్తెలు కావడం విశేషం. ఈ వేడుకలను ఆర్టిస్టిక్ డైరెక్టర్ కుమారి శివాని శివకుమార్ మరియు సీనియర్ నృత్య గురువు శ్రీమతి కావ్య శేఖర్ నేతృత్వం లో అట్టహాసంగా జరిగాయి.