టీమిండియా ఆలౌట్‌.. స్కోరు?

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య రాజ్‌కోట్‌ టెస్టులో రెండో రోజు ఆట ఆరంభమైంది. 326/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత జట్టు శుక్రవారం నాటి ఆట మొదలుపెట్టింది. ఆరంభంలోనే కుల్దీప్‌ యాదవ్‌(4), రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలో ధ్రువ్‌ జురెల్‌(46), రవిచంద్రన్‌ అశ్విన్‌(37) ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిన పడేశారు. చివర్లో బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్‌) చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో బుమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో టీమిండియా ఆఖరి వికెట్‌ కోల్పోయింది. 130.5 ఓవర్లలో 445 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో పేసర్లు మార్క్‌ వుడ్‌ 4, ఆండర్సన్‌ ఒకటి.. స్పిన్నర్లు రెహాన్‌ అహ్మద్‌ రెండు, టామ్‌ హార్లే ఒకటి, జో రూట్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

Spread the love