నవతెలంగాణ – కర్నాటక: విమానంలో గుర్తు తెలియని ద్రవం తాగి హాస్పిటల్ పాలైన కర్నాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం కుదుటపడింది. అగర్తలాలోని ఐఎల్ఎస్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అతను బుధవారం డిశ్చార్జ్ అయ్యాడు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి బెంగళూరుకు చేరుకున్నాడు. ట్రావెలింగ్లో ఎలాంటి నొప్పి లేకుండా ఉండేందుకు కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నట్లు సమాచారం. తదుపరి ట్రీట్మెంట్ కోసం మయాంక్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం తన పరిస్థితి మెరుగ్గానే ఉందని మయాంక్ వెల్లడించాడు. వీలైనంత త్వరగా టీమ్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ‘నేనిప్పుడు బాగానే ఉన్నా. రీఎంట్రీకి రెడీ అవుతున్నా. మీ ప్రార్థనలు, మీరు చూపిన ప్రేమ, మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు’ అని మయాంక్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.