గంగవరం పోర్టు గేట్‌ వద్ద ఉద్రిక్తత

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ముట్టడి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ముట్టడి

నవతెలంగాణ విశాఖ: గంగవరం పోర్టు గేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న పోర్టు యాజమాన్యంపై ఆగ్రహంతో ఉన్న కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే గాజువాక బాలచెరువు వైపు ఉన్న స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి కార్మికులు గంగవరం పోర్టులోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఈ క్రమంలో  పోలీసులను తోసుకుంటూ కార్మికులు పోర్టు గేట్‌ వద్దకు పరుగులు తీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు పోర్టు గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గేట్‌ వద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు గంగవరం పోర్టు ఫైర్, ఇతర రక్షణ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు. అయినప్పటికీ వెనక్కి వెళ్లేది లేదంటూ పోర్టు గేటుకు 50 అడుగుల దూరంలో 1500 మంది స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, 1800 మంది కాంట్రాక్టు కార్మికులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Spread the love