ప్రీమియం లీగ్-1 క్రికెట్ లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ.1 లక్ష

– రెండవ బహుమతి రూ.50వేల రూపాయలను అందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో నిర్వహించినటువంటి
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
వెస్ట్ చౌటుప్పల్ ప్రీమియం లీగ్-1 క్రికెట్ పోటీలు పది రోజులుగా క్రికెట్ పోటీలు క్రీడాకారులు పాల్గొని విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా రూ.1లక్ష రూపాయలు, రెండవ బహుమతి రూ.50 వేల రూపాయలను ఆదివారం మునుగోడు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ పోటీల ద్వారా యువకులు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని అన్నారు. వారితోపాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పాల్గొన్నారు.వెస్ట్ చౌటుప్పల్ ప్రీమియం లీగ్-1 క్రికెట్ టోర్నమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి స్పాన్సర్స్ గా ముందుకు వచ్చిన దాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు రాజుగౌడ్ గారి నేతృత్వంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ZPTC చిలుకూరి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉబ్బు వెంకటయ్య,పిఎసిఎస్ ఉపాధ్యక్షులు చెన్నగోని అంజయ్య గౌడ్,మాజీ మండల అధ్యక్షులు గుండు మల్లయ్య గౌడ్,చింతల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు మోగుదాల రమేష్ గౌడ్, బొబ్బిళ్ళ మురళీ  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Spread the love