రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీపీఐ(ఎం) మండల కార్యదర్శిని పరామర్శ

– మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన నెల్లికుదురు మండల సీపీఐ(ఎం) కార్యదర్శి  పెరుమాండ్ల తిలక్ బాబును పరామర్శించినట్లు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ తెలిపారు మహబూబాబాద్ లో నీ ఓ దావకానలో గాయాల పాలైన పెరుమాండ్ల తిలక్ బాబును ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిలక్ బాబు అనే వ్యక్తి ప్రజల మనిషి అని ప్రజల కష్టసుఖాలను పాలుపంచుకునే గొప్ప వ్యక్తి అని ఆయన ప్రజల సమస్యలు పరిష్కరించి మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో గాయాలైన తిలక్ బాబు తొందరగా కోలుకోవాలని సంబంధిత డాక్టర్లను కోరినట్లు చెప్పారు. అనంతరం మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన సాత్విక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మరియు 10వ వార్డు చేరువుకొమ్ము తండాకు చెందిన సుందర్ బావిలో పడి మృతిచెందగా విషయం తెలుసుకొని హాస్పిటల్ కు వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీ కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో లునవత్ అశోక్, నర్సింగ్ వెంకన్న, మందుల రఘు, రాజు, రాము, రాంచంద్రు, మహేష్, బాలు నాయక్, హుస్సేన్, భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.
Spread the love