ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన

– ఆంజనేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ పడవడిగడ్డ తండా
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మేచరాజుపల్లి గ్రామ శివారు పడమటి గడ్డ తండాలో ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామ తండా ఆంజనేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు జయరాం నాయక్ తెలిపారు శనివారం పడమటి గడ్డ తండాలో ఆంజనేయ విగ్రహ పుష్పాపణ కార్యక్రమాన్ని వేద పండితులచే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు మాజీ సర్పంచ్ వెలిశాల లక్ష్మి దేవేందర్ రవు హాజరై పూజలో పాల్గొన్నారని తెలిపారు.  గ్రామంలో నూతనంగా ఆంజనేయ విగ్రహాన్ని మరియు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాల నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ప్రతిష్టాపన కమిటీ గౌరవ అధ్యక్షులు గుగులోతు యాకుబు నాయక్ అధ్యక్షులు జయరాం నాయక్ ఉపాధ్యక్షులు గుగులోతు హచ్చునాయక్ ప్రధాన కార్యదర్శి గుగులోతు భాస్కర్ నాయక్ కమిటీ సభ్యులు నరసింహ,వెంకన్న , నాను రేవంత్ చంద్రశేఖర్, శ్రీను  రవికుమార్ గణేష్ ,పుల్యానాయక్  రందన్, బిచ్చ, మంగు , రవి, మంక్త్యా, తండ పెద్ద మనుషులు పాల్గొన్నారు.
Spread the love