హరితహారం పేరు మార్చిన సీఎం రేవంత్ రెడ్డి..

నవతెలంగాణ – వరంగల్: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు స్వాగతం పలికారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. హరితహారం పేరును వనమహోత్సవంగా మారుస్తున్నామని ప్రకటించారు. అనంతరం ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధిపై సమీక్షించనున్నారు.
Spread the love