ద్రోహం చేసే వారు పార్టీకి అవసరం లేదు.!

– నిరభ్యంతరంగా బయటికి వెళ్ళవచ్చు: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
మన బీఆర్ ఎస్ పార్టీ  ఉద్యమ పార్టీ అని, పార్టీకి పోరాటం కొత్తకాదు, ఆటుపోట్లను దాటి మళ్ళీ పుంజుకుంటామని, ద్రోహం చేసేవారు పార్టీకి అవసరం లేదని నిరభ్యంతరంగా బయటికి వెళ్ళవచ్చని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పక్కన పేట మండల స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అన్ని గ్రామ కమిటీలను పునరిద్దరిస్తామన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో  మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ని గెలిపించుకోవాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీ, మండల అధ్యక్షుడు పెసర సాంబరాజు, మహిళా మండల అధ్యక్షురాలు వెల్ది శోభారాణి ,బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love