దోపిడీ దొంగలేవరో ప్రజలే నిర్ణయిస్తారు 

-రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ 
-ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రసమయి వాఖ్యలపై అగ్రహం
-మండలాభివృద్ధిపై చర్చకు సిద్దమాని..సవాల్ 
నవతెలంగాణ-బెజ్జంకి : దోపిడీ దొంగలేవరో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనా లేక కాంగ్రెస్ పార్టీనా ప్రజలే నిర్ణయిస్తారని..ప్రజా నిర్ణయాలను ఎల్లప్పుడు శిరసవహిస్తామని రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో మండల కాంగ్రెస్ శ్రేణులు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు.ఈ సందర్భంగా మంగళవారం కల్లెపల్లి ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను దోపీడీ దొంగలు ఊర్లల్లకు వస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం చేసిన వాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారని.. మీరు మండలంలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమాని సవాల్ చేశారు.అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్ పార్టీ సవాలును స్వీకరించాలని సూచించారు.సమావేశంలో మండల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
Spread the love