హోమ్ ఓటింగ్ ను  పరిశీలించిన ఆర్డీవో..

నవతెలంగాణ – మునుగోడు
పార్లమెంట్ ఎన్నికలలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మునుగోడు మండలంలో పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగులకు హోమ్ ఓటింగ్  సౌకర్యం కల్పించగా 27 మంది హోమ్ ఓటింగ్ కు  దరఖాస్తు చేసుకోవడంతో శనివారం మండలంలో  దరఖాస్తు చేసుకున్న ఓటర్ల వద్దకు వెళ్లి ఓటింగ్ సద్వినియోగం చేసుకునే విధానము ను ఆర్డీవో సుబ్రహ్మణ్యం పరిశీలించారు . ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వేసవికాలంలో దృష్టిలో ఉంచుకొని అధికారులు పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ నాగరాజు , రెవిన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.
Spread the love