ఓటర్ నమోదును పరిశీలించిన ఆర్డీవో

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలో జనవరి 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుండి ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా 20, 21 తేదీలలో నూతన ఓటరు నమోదు, తప్పుల సవరణ దరఖాస్తులను స్వీకరించి త్వరగా ఆన్ లైన్లో నమోదు చేయాలని, బి ఎల్ వో లు వచ్చిన దరఖాస్తులను బూత్ వైజ్ గా రికార్డు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, బి ఎల్ వో లు ఉన్నారు.
Spread the love