రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హర్షం

నవతెలంగాణ – బొమ్మలరామారం 

సేవాలాల్ మహారాజ్ జయంతి ఈనెల 15 న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు సునీత నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నవతెలంగాణ తో మాట్లాడుతూ.. గిరిజన హక్కుల కోసం పోరాడిన గిరిజనుల ఆరాధ్య సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం, గిరిజనుల విజయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా గిరిజనులు రుణపడి ఉంటారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సెలవు దినంగా ప్రకటించడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య డాక్టర్ రామచంద్రనాయక్ ధన్యవాదాలు తెలిపారు.
Spread the love