బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ

బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ– హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ పీవీ ఘాట్‌ వద్ద నివాళి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని, దేశ ప్రధానిగా ఆయన సేవలు మరువలేనివని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పీవీ జ్ఞానభూమి, పీవీ ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పీవీ నూతన ఆర్థిక విధానాల రూపాశిల్పి అని, భూసంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తేవడంతో భారతదేశం ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.

Spread the love