ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం హర్షణీయం.

– పిఏసీఎస్ చైర్మన్ హరికృష్ణ రెడ్డి..
నవతెలంగాణ-తొగుట
కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం హర్షణీయమని పిఏ సీఎస్ చైర్మన్ హరికృష్ణ రెడ్డి అన్నారు.మంగళవా రం అయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో బాగంగా దుబ్బాక ఎమ్మెల్యే గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం హర్షణీయం అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే
కొత్త ప్రభాకర్ రెడ్డికి 53 వేల పై చిలుక మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండు సార్లు మెదక్ ఎంపీగా గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా దుబ్బాక ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చేవ చేయడం కోసం ఎల్లవేళలా అందు బాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Spread the love