సెవెన్ స్టార్ క్రియేషన్స్, ఆడియన్స్ పల్స్ ఎంటర్టై న్మెంట్స్ బ్యానర్ ద్వారా ‘ప్లాన్ బి’ డైరెక్టర్ కె.వి రాజమహి, సునీత రాజేందర్ దేవులపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న నాలుగు కథల ఈ ఆంథాలజీ చిత్రం ద్వారా నలుగురు కొత్త దర్శకులు సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు పరిచయం చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ చిత్ర ట్రైలర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ ట్రైలర్ చాలా బాగుంది. నలుగురు డైరెక్టర్స్కి అల్ ది బెస్ట్’ అని అన్నారు. దర్శకుడు నటుడు, వీరశంకర్, మాధవి లత ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర నిర్మాతలు కె.వి రాజమహి, సునీత రాజేందర్ మాట్లాడుతూ,’ఈ చిత్రంలో నటించిన సాయికుమార్, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్, ఇతర నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈచిత్రాన్ని ఈనెల 26వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. కథ, కథనం, మాటలను కె.వి రాజమహి అందించిన ఈ చిత్రంలో సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, రూప తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.