మూడో కన్ను రిపబ్లిక్‌ డే కానుకగా రిలీజ్‌

మూడో కన్ను రిపబ్లిక్‌ డే కానుకగా రిలీజ్‌సెవెన్‌ స్టార్‌ క్రియేషన్స్‌, ఆడియన్స్‌ పల్స్‌ ఎంటర్టై న్మెంట్స్‌ బ్యానర్‌ ద్వారా ‘ప్లాన్‌ బి’ డైరెక్టర్‌ కె.వి రాజమహి, సునీత రాజేందర్‌ దేవులపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న నాలుగు కథల ఈ ఆంథాలజీ చిత్రం ద్వారా నలుగురు కొత్త దర్శకులు సూరత్‌ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కష్ణమోహన్‌, మావిటి సాయి సురేంద్రబాబు పరిచయం చేస్తున్నారు. హీరో శ్రీకాంత్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీద ఒక మంచి కాన్ఫిడెన్స్‌ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్‌ అవుతుంది. చిన్న సినిమాలే మంచి సక్సెస్‌ సాధిస్తాయి. ఈ ట్రైలర్‌ చాలా బాగుంది. నలుగురు డైరెక్టర్స్‌కి అల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు. దర్శకుడు నటుడు, వీరశంకర్‌, మాధవి లత ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర నిర్మాతలు కె.వి రాజమహి, సునీత రాజేందర్‌ మాట్లాడుతూ,’ఈ చిత్రంలో నటించిన సాయికుమార్‌, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్‌, ఇతర నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈచిత్రాన్ని ఈనెల 26వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. కథ, కథనం, మాటలను కె.వి రాజమహి అందించిన ఈ చిత్రంలో సూర్య, మహేష్‌ వడ్డి, నిరోష, కౌశిక్‌ రెడ్డి, ప్రదీప్‌ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్‌ కౌసరి, దేవి ప్రసాద్‌, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, రూప తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Spread the love