ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీనే లక్ష్యంగా.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న బైక్ దొంగలను పట్టుకొని వారి నుండి 17 బైకులను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ డీసీపీ శబరీష్ పెట్ బషీరాబాద్ పీఎస్ లో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇద్దరు ద్విచక్ర వాహనాల దొంగలతో పాటు వాహనాలు కొనుగోలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.

Spread the love